కసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జయరాం

AP: అనంతపురం జిల్లా గుంతకల్ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. భక్తాదులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.





