ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలి: CM

AP: రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని CM చంద్రబాబు నాయుడు తెలిపారు. అసెంబ్లీలో ఎల్నినోపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర లోటు కనిపిస్తోందన్నారు. జూన్-డిసెంబర్ మధ్య 867 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 557 మి.మీ. మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని చెప్పారు. శ్రీశైలానికి 753 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 214 టీఎంసీలు మాత్రమే వచ్చాయని వివరించారు.



