మహిళలపై హింస..ఏడాదికి రూ.4.6 లక్షల కోట్ల నష్టం

మహిళలపై జరుగుతున్న హింస దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ భారం వేస్తోంది. మే 2026లో విడుదలైన NCRB ‘క్రైమ్ ఇన్ ఇండియా 2024’ రిపోర్ట్ ప్రకారం, మహిళలపై నేరాల కేసులు 4,41,534 నమోదయ్యాయి. ప్రతి 71 సెకన్లకు ఒక FIR నమోదైంది. 2014 నుంచి ఈ కేసులు 30% పైగా పెరిగాయి. మహిళల ఏడాది సంపాదన సుమారు రూ.లక్ష అనుకున్నా, ఈ హింస కారణంగా కోల్పోయిన ఉత్పాదకత రూ.2.3 నుంచి 4.6 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇది మన GDPలో 0.8% నుంచి 1.6% వరకు ఉంటుంది.



