గంజాయి తాగిన యువకులకు పోలీసులు షాక్

TG: LBనగర్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను ఈగల్ ఫోర్స్ నార్కోటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం PS పరిధిలోని సాహెబ్నగర్ బాల్రెడ్డి గ్రౌండ్ సమీపంలో దాడిచేసి పట్టుకున్నారు. చింతల్కుంట సరస్వతీనగర్కు చెందిన గుర్రపు హర్ష్ రోహిత్, వనస్థలిపురం పోలీస్ కాలనీకి చెందిన కోట కృపాకర్ గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్నేహితుల ప్రభావంతోనే గంజాయికి అలవాటు పడ్డామని విచారణలో వారు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.



