నల్గొండ ప్రిన్సిపల్ హత్యలో బిగ్ ట్విస్ట్!

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ <a href="https://www.theclearcutnews.com/n/nWdFsLS">రూపారెడ్డి</a> హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ దారుణానికి పాల్పడింది పదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్ అని పోలీసులు గుర్తించారు. క్లూస్ దొరక్కుండా గ్లౌజులు వేసుకుని ప్రిన్సిపల్ను కత్తితో పొడిచి చంపినట్లు తేల్చారు. హత్య అనంతరం ఇంట్లోని రూ.4 లక్షల క్యాష్తో పరారైన ఈ ముగ్గురు నిందితులను ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి డీటైల్స్ ఈరోజు సాయంత్రంలోగా పోలీసులు అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.



