మండలి డిప్యూటీ చైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం

AP: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన ఘటన జరిగింది. మండలిలో టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యుల కంటే వైసీపీ సభ్యులు మెజార్టీ సంఖ్యలో ఉండడంతో కూటమి తరుఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో వైఎస్సార్సీపీ నుండి తూమాటి మాధవరావు డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు.



