సామాజిక న్యాయమే మా ఆశయం: రేవంత్రెడ్డి

TG: బహుజనులు, కల్లుగీత కార్మికులు, గౌడన్నల అండదండలతో వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలిచి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని CM రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం, బహుజనులకు అధికారం తమ ప్రజా ప్రభుత్వ ఆశయమని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ట్యాంక్బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు.




