స్నాప్చాట్లో పరిచయం.. ఖరీదైన కార్లతో గాలం

TG: ఖరీదైన కార్లు, లగ్జరీ దుస్తులతో సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి మహిళలను ఆకర్షించి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డికి చెందిన సాగర్ చౌదరి అలియాస్ సాయిసునీల్, శివాంగుల భరత్కుమార్ స్నాప్చాట్ ద్వారా మహిళలకు పరిచయమై వారిని నమ్మించి బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 20మంది మహిళలను మోసం చేసి 40తులాల బంగారం అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆభరణాలను నగల దుకాణాల్లో విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు.



