← Back to news

మొదటి విజయమిదే.. ఉద్యమం విరమిస్తున్నాం: CJP

By DK· 26 Jul 2026· ఢిల్లీ
మొదటి విజయమిదే.. ఉద్యమం విరమిస్తున్నాం: CJP

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కొనసాగిన ఆందోళనను CJP విరమిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తొలి విజయం సాధించామని తెలిపింది. విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి కేంద్రం అంగీకరించిందని, నీట్ పేపర్ లీక్ బాధిత కుటుంబాలకు పరిహారం అంశంపైన సానుకూల స్పందన లభించిందన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేసులు ఎత్తివేస్తామని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

More in India