PF ఖాతాదారులకు బిగ్ అలర్ట్..

ఆన్లైన్ ద్వారా PF సేవల వినియోగం పెరగడంతో, సైబర్ నేరగాళ్లు అసలైన సైట్ను పోలిన నకిలీ వెబ్సైట్లు, లింకులతో మోసాలకు పాల్పడుతున్నారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తెలిపింది. PF బ్యాలెన్స్, క్లెయిమ్,KYC పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దని స్పష్టం చేసింది. సైబర్ మోసగాళ్లకు UAN, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్ లేదా OTP సమాచారాన్ని అందిస్తే అకౌంట్లో ఉన్న డబ్బు క్షణాల్లో మాయమయ్యే ప్రమాదముందని, కేవలం అధికారిక పోర్టల్ ద్వారానే సేవలు పొందాలని సూచించింది.



