డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం: నలుగురి అరెస్ట్

ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు 'డిజిటల్ అరెస్ట్' పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను ఛేదించి, పంజాబ్, రాజస్థాన్లలో నలుగురిని అరెస్ట్ చేశారు. ఒక రిటైర్డ్ ఆర్మీ కల్నల్ నుండి రూ. 15 లక్షలకు పైగా నక్కేసిన కేసులో ఈ చర్యలు తీసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా బ్యాంక్ ఖాతాలను సేకరించి, కంబోడియా, యుఏఈల్లోని సైబర్ నేరగాళ్లకు అందించినట్లు నిందితులు అంగీకరించారు. ఈ ఖాతాకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల లావాదేవీలతో కూడిన 17 ఫిర్యాదులు నమోదు అయ్యాయి.



