← Back to news

జంతర్ మంతర్ వద్ద అభిజీత్ దీప్కే నిరసన

By DK· 18 Jul 2026

ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లారని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఈ సందర్భంగా వందలాది మంది యువతతో ఆయన శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీట్, తదితర ఉద్యోగ, ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలు, పేపర్ లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న పార్లమెంట్‌ను ముట్టడించనున్నట్లు తెలిపారు. పేపర్ లీక్‌లపై తమ పోరాటం ఆగదన్నారు.

More in Education