జంతర్ మంతర్ వద్ద అభిజీత్ దీప్కే నిరసన
ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను ఢిల్లీ పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లారని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఈ సందర్భంగా వందలాది మంది యువతతో ఆయన శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీట్, తదితర ఉద్యోగ, ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలు, పేపర్ లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న పార్లమెంట్ను ముట్టడించనున్నట్లు తెలిపారు. పేపర్ లీక్లపై తమ పోరాటం ఆగదన్నారు.



