పెట్రోల్, డీజిల్ ఆటోల స్థానంలో ఈవీలు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ను స్వచ్ఛమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా CURE పరిధిలోని అర్హత కలిగిన పెట్రోల్, డీజిల్ ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేయడం ఈ పథకం లక్ష్యం.



