హోటల్ గదిలో యువతి సూసైడ్

AP: విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన షేక్ రషీదా బేగం(26) విశాఖపట్నంలోని గాజువాకలో బ్యూటీషియన్గా పనిచేస్తోంది. ఆమె సన్నిహితుడు లింగాల వెంకట గణేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఓ హోటల్లో గది తీసుకున్న ఆమె, ఎంతకీ బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు తెరిచి చూడగా రషీదా బేగం స్కార్ఫ్తో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం KGHకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



