బాలాపూర్ గణేశుడి కోసం ఈసారి అదిరిపోయే థీమ్ రెడీ!

TG: తెలంగాణలో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన బాలాపూర్ గణేశుడు ఈసారి కొత్తగా దర్శనమివ్వనున్నాడు. ఏటా ప్రముఖ ఆలయాల నమూనాలో మండపాన్ని ఏర్పాటు చేసే నిర్వాహకులు.. ఈసారి ఒడిశాలోని ఫేమస్ పూరీ జగన్నాథస్వామి టెంపుల్ నమూనాలో మండపాన్ని డిజైన్ చేస్తున్నారు. గతంలో శ్రీశైలం, యాదాద్రి, కనకదుర్గ, అయోధ్య, అరుణాచలం ఆలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.



