← Back to news

సైబర్ మోసాల్లో మహిళ బ్యాంక్ అకౌంట్..భయంతో ఆత్మహత్య

By Vishi· 28 Aug 2026· Ndtv
సైబర్ మోసాల్లో మహిళ బ్యాంక్ అకౌంట్..భయంతో ఆత్మహత్య

థానే జిల్లా డొంబివలి(తూర్పు) సైరామ్ సొసైటీలో దేవికా అర్ముగం పండరం(38) సూసైడ్ చేసుకున్నారు. ఆమె బ్యాంక్ అకౌంట్‌ను సైబర్ మోసాల్లో వాడారని రాజస్థాన్‌లోని చురు పోలీసులు ఆగస్టు 8న ఆమె ఇంటికి వచ్చి నోటీసు ఇచ్చారు. దీనిపై క్లారిటీ కోసం ఆమె థానే పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగానికి వెళ్లారు. అక్కడ హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల్లో ఆమెపై సైబర్ మోసం కేసులున్నాయని చెప్పారు. దీంతో భయపడ్డ ఆమె బ్లేడ్‌తో చేయి, గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 6h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.