చెల్లికి మెసేజ్.. కొద్దిసేపటికే ఊహించని విషాదం

TG: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ శ్రీసాయిరామ్నగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి మహేశ్ (29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బేగంపేటలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఆయనకు మానసిక స్థితి సరిగాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యులు సొంతూరికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. తల్లిదండ్రులు, చెల్లిని మిస్ అవుతున్నానంటూ చెల్లికి మెసేజ్ పంపడంతో ఆమెకు అనుమానం వచ్చింది. సమీప బంధువు గిరిబాబుకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఇంటికి వెళ్లి చూడగా మహేశ్ ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



