హాకీ జట్టుకు కాషాయ రంగు జెర్సీ..విపక్షాల మండిపాటు

భారత హాకీ జట్టుకు కొత్తగా కాషాయ రంగు జెర్సీ ప్రవేశపెట్టడంపై విపక్షాలు కేంద్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. FIH హాకీ వరల్డ్ కప్కు ముందు హాకీ ఇండియా పురుషులు, మహిళల జట్లకు కాషాయ రంగు జెర్సీని ఎంపిక చేయడంతో ఈ వివాదం మొదలైంది. దేశంలో క్రీడారంగాన్ని కాషాయీకరణ చేస్తున్నారా అని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇలాగే కొనసాగితే భారత సైన్యం యూనిఫాం కూడా కాషాయ రంగులోకి మారుతుందని అంటున్నారు. మాజీ భారత కెప్టెన్ విరెన్ రస్క్విన్హా కూడా దీనిపై విమర్శలు చేశారు.


