డెలివరీ బాయ్స్ మధ్య వివాదం.. ఒకరు మృతి

TG: హైదరాబాద్ శివారు నార్సింగిలో డెలివరీ బాయ్స్ మధ్య జరిగిన ఘర్షణ విషాదంగా మారింది. డెలివరీ విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. గురువారం రాత్రి పనిచేసే ప్రాంతంలో మరోసారి వాగ్వాదం జరగడంతో వివాదం తీవ్రమైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా, కోకాపేటకు చెందిన బ్లింకెట్ డెలివరీ బాయ్ అబ్దుల్ సమీద్(31) తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్పాట్లోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నార్సింగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.



