← Back to news

డెలివరీ బాయ్స్‌ మధ్య వివాదం.. ఒకరు మృతి

By dk· 14 Aug 2026· హైదరాబాద్
డెలివరీ బాయ్స్‌ మధ్య వివాదం.. ఒకరు మృతి

TG: హైదరాబాద్‌ శివారు నార్సింగిలో డెలివరీ బాయ్స్‌ మధ్య జరిగిన ఘర్షణ విషాదంగా మారింది. డెలివరీ విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. గురువారం రాత్రి పనిచేసే ప్రాంతంలో మరోసారి వాగ్వాదం జరగడంతో వివాదం తీవ్రమైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా, కోకాపేటకు చెందిన బ్లింకెట్‌ డెలివరీ బాయ్‌ అబ్దుల్‌ సమీద్‌(31) తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్పాట్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నార్సింగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.