నకిలీ DSP డ్రామా బట్టబయలు

AP: పల్నాడు జిల్లా యడవల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి ప్రదీప్ నకిలీ పోలీస్ అధికారిగా చలామణి అవుతూ భారీ మోసాలకు పాల్పడ్డాడు. తాను సైబర్ వింగ్ DSP అని బాధితులను నమ్మించి, సైబర్ మోసాల్లో పోయిన డబ్బు తిరిగి ఇప్పిస్తానని చెప్పి లక్షలు వసూలు చేశాడు. విద్యాసంస్థల్లో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులతో పరిచయాలు పెంచుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో అసలు నిజం బయటపడగా, అతడిపై ఒంగోలు PSలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



