అవమానంతో సూసైడ్ చేసుకున్న శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్

AP: కాకినాడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో ఫీజ్ కట్టలేదని అవమానించడంతో ఇంటర్ ఫస్టియర్ (15 ఇయర్స్) స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఫీజ్ కట్టలేదని క్లాస్రూమ్లో అందరి ముందు స్టాఫ్ నిలదీసి ఇంటికి పంపారు. ఇది చూసిన తోటి స్టూడెంట్స్ నవ్వడంతో అవమానంగా భావించి ఆ స్టూడెంట్ నిన్న రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టాఫ్ వేధింపుల వల్లే తమ కొడుకు చనిపోయాడని ఆరోపిస్తూ పేరెంట్స్, బంధువులు ఆందోళనకు దిగారు. కాలేజ్పై దాడి చేయడానికి ప్రయత్నించారు.



