← Back to news

అవమానంతో సూసైడ్ చేసుకున్న శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్

By Mahesh· 8 Aug 2026· కాకినాడ
అవమానంతో సూసైడ్ చేసుకున్న శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్

AP: కాకినాడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్‌లో ఫీజ్ కట్టలేదని అవమానించడంతో ఇంటర్ ఫస్టియర్ (15 ఇయర్స్) స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఫీజ్ కట్టలేదని క్లాస్‌రూమ్‌లో అందరి ముందు స్టాఫ్ నిలదీసి ఇంటికి పంపారు. ఇది చూసిన తోటి స్టూడెంట్స్ నవ్వడంతో అవమానంగా భావించి ఆ స్టూడెంట్ నిన్న రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టాఫ్ వేధింపుల వల్లే తమ కొడుకు చనిపోయాడని ఆరోపిస్తూ పేరెంట్స్, బంధువులు ఆందోళనకు దిగారు. కాలేజ్‌పై దాడి చేయడానికి ప్రయత్నించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.