పేపర్ లీక్ కేసులో సంచలనం.. గుప్తా అరెస్ట్

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బిరేంద్ర కుమార్ గుప్తాను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను పుణె విమానాశ్రయానికి తీసుకువచ్చి భివాండి పోలీసులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. టెట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఈ కేసు నమోదు కాగా, గుప్తా పాత్రపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.



