← Back to news

పేపర్ లీక్ కేసులో సంచలనం.. గుప్తా అరెస్ట్

By DK· 25 Jul 2026· బీహార్
పేపర్ లీక్ కేసులో సంచలనం.. గుప్తా అరెస్ట్

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బిరేంద్ర కుమార్ గుప్తాను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను పుణె విమానాశ్రయానికి తీసుకువచ్చి భివాండి పోలీసులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. టెట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఈ కేసు నమోదు కాగా, గుప్తా పాత్రపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 14h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.