అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: CM చంద్రబాబు

AP: 2036 ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం దక్కితే.. ప్రపంచస్థాయి క్రీడా వేదికగా అమరావతిని తీర్చిదిద్దాలని CM చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో ప్రతిపాదిత స్పోర్ట్స్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ఒలింపిక్స్ నిర్వహణకు అనువైన ప్రదేశంగా రూపొందించాలని సూచించారు. రాజధాని నిర్మాణం, రైతుల లేఔట్లు, మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల కోసం కేటాయింపుల అనంతరం సీఆర్డీఏ వద్ద మిగిలిన 3,800 ఎకరాలను అత్యంత పొదుపుగా వినియోగించాలని స్పష్టం చేశారు.



