← Back to news

వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు

By DK· 18 Jul 2026· ఢిల్లీ

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేందమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంలో ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. నీట్, ఇతర పరీక్షల ప్రశ్నపత్రాల లీక్, అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వాంగ్‌చుగ్ జూన్ 28న నిరవధిక దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే.

More in Education