పదేళ్లుగా 152 ఎగ్జామ్ పేపర్స్ లీక్- రాహుల్ గాంధీ

దేశంలో గత పదేళ్లలో ఏకంగా 152 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. డెహ్రాడూన్లో విద్యార్థులతో మాట్లాడిన ఆయన, ఈ లీకేజీల వల్ల కోట్లాది మంది యువత భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను కొందరు గుత్తాధిపత్యం చేస్తున్నారని విమర్శించారు. పేపర్ లీక్లకు వ్యతిరేకంగా పటిష్టమైన చట్టం తేవాలని, విద్యార్థుల కష్టానికి తగిన న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.



