‘వందేమాతరం’ మొదటి రెండు స్టాంజాలు మాత్రమే అందరికీ సరిపోయేవి

‘వందేమాతరం’పై కొనసాగుతున్న చర్చలో సీనియర్ నటి శర్మిలా ఠాగూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ గీతంలోని మొదటి రెండు స్టాంజాలు మాత్రమే పాడాలని ఆమె అన్నారు. భారతదేశం వివిధ మత విశ్వాసాలు ఉన్న ప్రజలకు నెలవు అని, కొంతమంది ఒకే దేవుణ్ణి ఆరాధించే విశ్వాసాలను కలిగి ఉంటారని అన్నారు. పాటలోని తరువాతి భాగాల్లో కాళి, దుర్గ వంటి హిందూ దేవతల ప్రస్తావన ఉండటం వల్ల కొన్ని సమాజాల విశ్వాసాలకు అవి సరిపోకపోవచ్చని చెప్పారు. మొదటి రెండు స్టాంజాలు మాత్రమే అన్ని మతాల ప్రజలకు సరిపోయేవి అని అభిప్రాయపడ్డారు.


