హాస్టల్లో దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు!
AP: కాకినాడలోని ఎస్కే నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ మిస్ అవ్వడంతో మణిపూర్, AP స్టూడెంట్స్ మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు అనుమానంతో కర్రలు, చీపుర్లు, బకెట్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్, SP, పోలీసులు వెంటనే స్పాట్కు వెళ్ళి సిట్యుయేషన్ను కంట్రోల్ చేశారు. ముందస్తు జాగ్రత్తగా మణిపూర్ విద్యార్థినులను వేరే హాస్టల్కు షిఫ్ట్ చేశారు.



