అమరావతి అభివృద్ధికి బిగ్ బూస్ట్

AP: అమరావతి నిర్మాణంలో సీడ్ యాక్సెస్ రోడ్డు మొదటి మెట్టు అని CM చంద్రబాబు అన్నారు. ఉండవల్లి వద్ద అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరుతో అనుసంధానించే సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ఆయన ప్రారంభించారు. ఈ రహదారికి అనుసంధానంగా బకింగ్హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఘట్టాన్ని స్వర్ణాంధ్ర విజన్కు తొలి విజయంగా అభివర్ణించారు.



