యూనివర్సిటీల్లో భారీ మార్పులు

AP: రాష్ట్రంలోని 19 యూనివర్సిటీల పాలక మండళ్లను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నామినేట్ చేసిన సభ్యులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్లాజ్-2 కింద నియమితులైన సభ్యులకే ఈ నిర్ణయం వర్తిస్తుందని, క్లాజ్-1 కింద ఉన్న ఎక్స్ ఆఫిషియో సభ్యులు యథావిధిగా కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాల పాలనలో పారదర్శకత, సమర్థత పెంచే దిశగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది.



