పేదలకు ‘భూలక్ష్మి’ పథకంతో ఎకరం భూమి: కవిత
TG: తాము అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పేరుతో భూమిలేని పేద కుటుంబాలకు ఎకరం భూమి ఇస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పేదల భూములను సీఎం రేవంత్రెడ్డి లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఆచరణలో సామాజిక న్యాయం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పేదలకు భూమి పంపిణీతోనే తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు వస్తుందని అన్నారు.



