తమిళనాడు పాస్టర్కు నాలుగు మరణశిక్షలు

తమిళనాడులోని తిరునెల్వేలి POCSO స్పెషల్ కోర్టు ఒక ఘోరమైన కేసులో బిగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. 2022లో సమ్మర్ మోరల్ క్లాసెస్ పేరుతో నలుగురు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన S. అబ్రహం (47) అనే పాస్టర్కు కోర్టు ఏకంగా నాలుగు మరణశిక్షలు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో పాటు అతనికి ₹52,000 జరిమానా విధించింది. బాధిత బాలికలకు ఒక్కొక్కరికి ₹10 లక్షల చొప్పున పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.



