శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తాం

నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని రేపు నిర్వహించనున్న ‘చలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోనమ్ వాంగ్చుక్ పిలుపునిచ్చారు. ఈ మార్చ్ను ఐదు ప్రధాన అంశాలతో శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భారత త్రివర్ణ పతాకమే ఉంటుందని, ఏ రాజకీయ పార్టీ లేదా సంస్థ జెండాలు ఉండవని స్పష్టంచేశారు. పాల్గొనేవారు భారత రాజ్యాంగం లేదా మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, భగత్సింగ్ ఫోటోలను తీసుకురావాలని సూచించారు. సానుకూల నినాదాలే చేయాలని, హింసకు పాల్పడకూడదని వాంగ్చుక్ తెలిపారు.


