← Back to news

అమీన్పూర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

By Shankar Soudarpally· 22 Aug 2026
అమీన్పూర్‌లో  అభివృద్ధి పనులకు శంకుస్థాపన

TG: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌ డివిజన్‌లో మౌలికవసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ రూ.8.19 కోట్ల పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాజేంద్రరెడ్డి కాలనీ, సాయిఅంబిక కాలనీ, పీఎన్‌ఆర్ కాలనీ, నరేంద్రనగర్, సాయిరామ్ ఎంక్లేవ్, శంకర్ గ్రీన్ హోమ్స్, బృందావన్ టీచర్స్ కాలనీ, నవ్య నందనవనం, నర్రేగూడెం, రాజీవ్ గృహకల్ప కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో సుమారు రూ.8.19 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అమీన్పూర్‌లో  అభివృద్ధి పనులకు శంకుస్థాపన

More in Local