ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిన్న చింతకుంట, జక్కపల్లి గ్రామాల రైతులకు లింగాపూర్ రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విధానాలు, వివిధ కిట్ల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ, తక్కువ పెట్టుబడితో సాగు వంటి అంశాలపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వివరించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేసి వాటి వినియోగ విధానాన్ని తెలిపారు.



