← Back to news

రాజాంలో గణేశ్ ఉత్సవాలకు డీజేలకు క్లియర్ నో.. పర్మిషన్ లేదు!

By Mohan· 1d ago
రాజాంలో గణేశ్ ఉత్సవాలకు డీజేలకు క్లియర్ నో.. పర్మిషన్ లేదు!

విజయనగరం జిల్లా రాజాం మండలంలో వచ్చే గణపతి ఉత్సవాలకు డీజేలకు అనుమతి లేదని సీఐ నవీన్ కుమార్ హెచ్చరించారు. శబ్ద కాలుష్యం కారణంగా ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని, ఏ డీజే అయినా నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్వాహకులు కట్టుదిట్టమైన నియమాలు పాటించాలని ఆదేశించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.