← Back to news

పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ

By siva NEWS· 1h ago
పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో టీడీపీ క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఆర్ అండ్ బి బంగ్లాలో జరిగిన సమావేశంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, TTD బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. టౌన్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ ఇంచార్జ్‌లు, బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకులతో పార్టీ బలోపేతంపై చర్చించారు. గురజాల నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులపై నాయకులు సమీక్షించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 39m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.