← Back to news

కార్మిక చట్టాల ఉల్లంఘనలపై ఫిర్యాదు

By Surender Panuganti· 3h ago· Jadcherla, Jadcherla, Mahabubnagar
కార్మిక చట్టాల ఉల్లంఘనలపై ఫిర్యాదు

కార్మిక చట్టాల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలోని Amspro Lifesciences Pvt Ltd. (Sy.No.631/A1) కంపెనీపై సామాజిక కార్యకర్త కోస్గీ వెంకటయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సంస్థలో గత 4–5 నెలలుగా సుమారు 150 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ESI, EPF వంటి సౌకర్యాలు కల్పించకుండా విధులు నిర్వహింపజేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

More in Local