జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే-జడ్పీటీసీ వాగ్వాదం
శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం స్థాయి సంఘ సమావేశం తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, పోలాకి జడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య మధ్య అభివృద్ధి పనులు, పింఛన్లపై ఆరోపణలు, సవాళ్లు వచ్చాయి. నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రవికుమార్ పేర్కొనగా, ముందుగా ఎంపీటీసీగా గెలిచి చూపించాలని కృష్ణచైతన్య సవాల్ విసిరారు. ఇరువర్గాల మధ్య వాడివేడి వాదనలు, నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు, ఇతర సభ్యులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.



