ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

TG: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఏఈఓ క్రిసోలైట్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే కషాయాలు, బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి తయారీ విధానాలపై రైతులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించారు.



