← Back to news

గుత్తిలో వైఎస్సార్‌కు ఘన నివాళులు

By MADDIMANENI PRASANNAKUMAR· 2d ago
గుత్తిలో వైఎస్సార్‌కు ఘన నివాళులు

AP: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గుత్తి పట్టణం, గుత్తి ఆర్‌ఎస్‌లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని రైతులు, పేదలు, విద్య, వైద్యం, పింఛన్లు, సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్సార్ ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు.

గుత్తిలో వైఎస్సార్‌కు ఘన నివాళులు

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.