గుత్తిలో వైఎస్సార్కు ఘన నివాళులు

AP: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గుత్తి పట్టణం, గుత్తి ఆర్ఎస్లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని రైతులు, పేదలు, విద్య, వైద్యం, పింఛన్లు, సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్సార్ ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు.




