← Back to news

రూ.213.96 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం

By siva NEWS· 4h ago
రూ.213.96 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో రూ.213.96 కోట్ల నిధులతో చేపట్టనున్న సమగ్ర మంచినీటి అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేశారు. మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, TTD బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. UIDF, అమృత్ 2.0 నిధులతో మంచినీటి సరఫరా, వాటర్ పంపింగ్ వంటి పనులు చేపట్టనున్నారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.