నా ఇద్దరి పిల్లలని కూడా కొట్టండి!
ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రదేశంలో ఒక తల్లి పోలీసుల ఎదుట కన్నీళ్లు పెట్టుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నిన్న చాలా మంది పిల్లల తలలు పగలగొట్టారు కదా.. నా ఇద్దరి పిల్లలని కూడా తీసుకొచ్చాను, వీరిని కూడా కొట్టేయండి" అంటూ ఆవేదనతో ఆమె మాట్లాడిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల ప్రవర్తనను ప్రశ్నిస్తూ, ఆ తల్లి తీవ్రంగా స్పందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


