విద్య వైద్య రంగాల సమస్యలను పరిష్కరించాలి

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలతో పాటు విద్యా, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ ఆర్డీవో అర్చనకు వినతిపత్రం అందించారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందడం లేదని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు.




