కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు

హొళగుంద మండలం హెబ్బటం గ్రామ పరిసరాల్లో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. రాత్రిపూట కోతలు విధించడంతో ఉక్కుపోత, దోమలతో ప్రజల త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు, ఐదు రోజులుగా కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. వీధుల్లో నెలకొన్న చీకట్లో ఏం జరుగుతుందో, ఎవరు వస్తున్నారో, ఎక్కడ విషపురుగులు సంచరిస్తున్నాయో తెలియక స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.


