మిథున్ చక్రవర్తి .. మోహన్ లాల్.. అనంత్నాగ్.. ఎందుకిలా?

కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. గతంలో బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి, మలయాళ నటుడు మోహన్ లాల్ ఈ అవార్డు అందుకున్నారు. వీళ్లంతా ప్రధాని మోదీకి లేదా బీజేపీకి సన్నిహితంగా మెలిగే వ్యక్తులు. అనంత్ నాగ్ తనను తాను బహిరంగంగా ‘మోదీ భక్తుడి’గా ప్రకటించుకున్నారు. ఇలా మోదీని పొగిడే లేదా బీజేపీకి అనుకూలంగా ఉండే నటులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అవార్డుకు అదే అర్హతా అని ప్రశ్నిస్తున్నారు.



