← Back to news

నాగులేరుకు నీళ్లు విడుదల చేయాలి: జక్కా అశోక్‌

By siva· 1d ago
నాగులేరుకు నీళ్లు విడుదల చేయాలి: జక్కా అశోక్‌

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో నాగులేరుకు వెంటనే నీటిని విడుదల చేయాలని వైసీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు జక్కా అశోక్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ... దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక గ్రామాల్లో బోర్లు ఎండిపోతున్నాయని తెలిపారు. మరో 10–15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటి సమస్య మరింత తీవ్రతరం అవుతుందని అన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.