← Back to news

పేకాట స్థావరంపై పోలీసులు పంజా..!

By chandra shekar· 12h ago· Ammapalem, Vemsoor, Khammam
పేకాట స్థావరంపై పోలీసులు పంజా..!

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రాయుడుపాలెం గ్రామ సమీపంలోని గుట్టపై పేకాట కొట్టు ఉంది. దానిపై ఎస్సై పల్లెల ప్రదీప్ ఆధ్వర్యంలో పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు పట్టుబడ్డారు. మరో ఆరుగురు పరారయ్యారు. పోలీసులు వారి నుంచి 52 పేక ముక్కలు, రూ.3,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నాలుగు బైక్లు, మూడు ఫోన్లు కూడా జప్తు చేశారు. మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మీ ఊర్లో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలున్నా? మీ వార్త పంపండి!

పేకాట స్థావరంపై పోలీసులు పంజా..!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 38m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.