← Back to news

వేధింపులు ఎదురైతే భయపడొద్దు: షీటీమ్ భరోసా

By KONTU SAGAR· 22 Aug 2026
వేధింపులు ఎదురైతే భయపడొద్దు: షీటీమ్ భరోసా

TG: విద్యార్థినుల భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో షీ టీమ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. రామగుండం సీపీ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో మార్కండేయ కాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్‌ఐ లావణ్య గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండటం, పోక్సో చట్టం, సోషల్ మీడియా ప్రభావంపై వివరించారు. మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.

వేధింపులు ఎదురైతే భయపడొద్దు: షీటీమ్ భరోసా

More in Local