← Back to news

రాఖీకి RTC షాక్.. ఛార్జీలు డబుల్!

By Ramesh· 4d ago
రాఖీకి RTC షాక్.. ఛార్జీలు డబుల్!

పెద్ద కడ్మూర్–నార్వా నుంచి హైదరాబాద్‌కి సాధారణం రూ.280 టికెట్‌ని రాఖీ పండుగ పేరుతో రూ.380కి పెంచేశారు. Aug 27 నుంచి 31 వరకు ఈ అదనపు చార్జీ. టికెట్‌పై రూ.380 ముద్రించేశారు – ముందస్తు సమాచారం లేదు, క్లారిటీ లేదు. "పండుగ రద్దీ" అని చెప్పి రూ.100 extra వసూలు చేసేశారు. "రెగ్యులర్‌గా రూ.300 ఉంటే, ఇప్పుడు రూ.400 కట్టాల్సి వచ్చింది. బోర్డింగ్ తర్వాతే హైక్ తెలిసింద''ని ఓ ప్రయాణీకుడు చెప్పారు. ఈ ఛార్జీ పెంపు మీకు న్యాయమేనా? మీ ఊరి రూట్‌లో కూడా ఇలాంటి హైక్ ఉందా? కామెంట్స్‌లో మీ అనుభవం షేర్ చేయండి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.