ఈ నెల 24న ఆటోల బంద్

ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వాలని, అలాగే ఆర్టిసికి విద్యుత్ ఆటోలు ఇవ్వాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే మూడు ప్రధాన డిమాండ్లతో ఈనెల 24న తెలంగాణాలో ఆటో డ్రయివర్లు బంద్ పాటించనున్నారు. ఈ మేరకు బంజర ఆటో డ్రైవర్ సంఘం, జేఏసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ పాల్గొని బందుకు సంబంధించిన పోస్టరును విడుదల చేశారరు. ఈ కార్యక్రమం జే.పుల్లారావు అధ్యక్షతన జరిగింది.



